ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజన్లలో మేయర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దానవాయిగూడెం, రామన్నపేటలో కార్పొరేషన్ సాధారణ నిధులు రూ.3.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ పాఠశాలలకు ప్రహరీ, మరుగుదొడ్ల పనులను ప్రారంభించారు.
రామన్నపేటలో రూ.5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నిప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కర్నాటి కృష్ణ, టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, 59,60వ డివిజన్ కార్పొరేటర్లు బట్టపోతుల లలితారాణి, బందె నిరంజన్, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, ఖమ్మంరూరల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు, నల్లూరి మధుబాబు, దామల రవి, తుమ్మెట్ల వెంకన్న, కొట్టె విజయ, నసిని కృష్ణ, వేముల రమేశ్, నాగటి భిక్షం, కొట్టె పాపారావు, దుద్దెల సురేశ్, మద్దెల ఉపేందర్, మిట్టగదపల మహేశ్, బండివ కృష్ణకుమారి పాల్గొన్నారు.