భద్రాచలం, అక్టోబర్ 2 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన మాట్లాడారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజు నుంచే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో పుట్టి డాక్టర్గా ఎన్నో వేలమందికి వైద్య సేవలందించిన మంచి మనిషి వెంకట్రావును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వెంకట్రావు గెలుపుతోనే సాధ్యమని పేర్కొన్నారు.
ఉదయం భద్రాద్రి రామయ్య ఆశీస్సులు తీసుకొని తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఇక్కడి సమస్యలు గురించి తెలిసిన వాడిని నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు కోరారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దారపునేని రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ లకావత్ వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.