మధిర, డిసెంబర్14: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎంకు ఆర్థిక ప్రత్యేకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, ఆర్థిక కార్యదర్శులు శ్రీదేవి, ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, లక్ష్మణ్, ఆదిశ్రీనివాస్, సంజీవరెడ్డి, ఐలయ్య, రాగమయి, మల్లారెడ్డి, రంగారెడ్డి, నాగరాజు, షబ్బీర్అలీ పాల్గొన్నారు.