సత్తుపల్లి రూరల్, ఫిబ్రవరి 6 : నేషనల్ హైవే నిర్మిస్తున్న క్రమంలో తమకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదాశివునిపేట గ్రామంలో భీమవరం, తుమ్మూరు, సదాశివునిపేటకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. హైవే నిర్మాణానికి రెండు వైపులా వేలాది ఎకరాల్లో పంట పొలాలు ఉన్నాయని, ఇందుకోసం సర్వీసు రోడ్డు ఇస్తే బాగుంటుందని గతంలో రైతులు రెండుసార్లు ఆందోళనలు చేశారు.
మళ్లీ మంగళవారం కూడా ఆందోళనకు దిగడంతో నేషనల్ హైవే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్వీస్ రోడ్డు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఐ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో కాల్నేని రాజేశ్, ఆళ్ల నాగేశ్వరరావు, కృష్ణ, మహేశ్వరరెడ్డి, చందు, పుల్లారెడ్డి, రామకృష్ణ, కృష్ణమూర్తి, చీకటి చిట్టిరావు పాల్గొన్నారు.