ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం 12మంది విద్యార్థులు కాఫీయింగ్కు పాల్పడుతుండగా డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ వై. వెంకయ్య తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇల్లందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, సత్తుపల్లిలోని కాకతీయ డిగ్రీలో ఇద్దరు, గీతమ్స్లో ఒకరు, జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీలో ఒకరు, మధిరలోని శీలం పుల్లారెడ్డిలో ఇద్దరు, ఖమ్మంలోని కవిత కళాశాలలో ఒకరు, కవిత మెమోరియల్లో డిగ్రీ కళాశాలలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.