ఖమ్మం : తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా..ఈ పండుగను పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా అదనంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైద్రాబాద్ నుంచి ఖమ్మం, కొత్తగూడెంకు, కొత్తగూడెం ,ఖమ్మం నుంచి హైద్రబాద్ వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. ఆన్లైన్లో www.tsrtconline.in లో ప్రత్యేక, రెగ్యులర్ బస్సులకు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు హైద్రాబాద్ నుంచి ఖమ్మంకు 110 స్పెషల్ బస్సులు, మధిరకు 51, సత్తుపల్లికి 91, ఖమ్మం డివిజన్కు 252, భద్రాచలం 83, కొత్తగూడెం కు72, మణుగూరుకు 53, కొత్తగూడెం డివిజన్ 208, రీజియన్కు 460 స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు హైద్రాబాద్కు స్పెషల్ బస్సులను నడుపనున్నారు.
ఖమ్మం నుంచి హైద్రాబాద్కు 115, మధిర నుంచి 45, సత్తుపల్లి నుంచి 85, ఖమ్మం డివిజన్ నుంచి 245, భద్రాచలం నుంచి 68, కొత్తగూడెం నుంచి 82, మణుగూరు నుంచి 45, కొత్తగూడెం డివిజన్ నుంచి 195, రీజియన్ నుంచి 440 బస్సులు సర్వీసులు నడుపనున్నట్లు ఖమ్మం రీజియన్ ఆర్టీసీ మేనేజర్ సాలోమాన్ తెలిపారు.