ఖమ్మం/ తిరుమలాయపాలెం, జనవరి 1 : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సీపీఎం యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో వారందరికీ తాతా మధు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో చెన్నబోయిన అంజయ్య, చెక్కల రాంమ్మూర్తి, పులిగుజ్జు లింగస్వామి, పులకాని ఉపేందర్, ఆదినారాయణ, నాగరాజు, మేకల శేఖర్, రమేశ్, నవీన్, జగదీశ్ ఉన్నారు.
ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, చామకూరి రాజ్కుమార్, దూదిమెట్ల శ్రీనివాస్, తాతా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.