మామిళ్లగూడెం, ఏప్రిల్ 18: ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు పారదర్శకంగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు సూచించారు. ఖమ్మం ఐడీవోసీకి గురువారం చేరుకున్న వారు.. కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి లోక్సభ ఎన్నికల కోసం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమును, మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్వాడ్, ఎస్ఎస్టీ బృందాలను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నిఘా బృందాలకు సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్యాగ్ సిస్టం అమర్చినట్లు తెలిపారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చెసిన స్రీన్ల ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
సీ-విజిల్, 1950 టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిషారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం నాటికి సీ-విజిల్ ద్వారా 38 ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ ద్వారా 64 ఫిర్యాదులు అందగా.. వాటిని పరిషరించినట్లు తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా ప్రచారంపై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రచార ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.