మధిర టౌన్, మే 21: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మధిర, ఎర్రుపాలెం మండలాల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. మధిర మండలంలోని మధిర సీపీఎస్, టీవీఎం, గర్ల్స్ హైస్కూల్, హరిజనవాడ హైస్కూల్, సిరిపురం హైస్కూల్ సెంటర్లలో మొత్తం 1006 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఎర్రుపాలెం, బనిగండ్లపాడు, సోషల్ వెల్ఫేర్ పాఠశాల పరీక్షా కేంద్రాల్లో మొత్తం 543 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
కూసుమంచి, మే 21: పరది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో బీవీ రామాచారి తెలిపారు. పరీక్షాల కేంద్రాల వద్ద విద్యార్థులు తాగునీరు, వైద్య సదుపాయం, విద్యుత్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
బోనకల్లు, మే 21: పది పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోనల్ ఇన్చార్జి ఎంఈవో ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మండలంలో 468 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
చింతకాని, మే 21: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈవో మోదుగు శ్యాంసన్ శనివారం తెలిపారు. మండల వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో మొత్తం 522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేశామని, ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
తల్లాడ, మే 21: తల్లాడ లయన్స్క్లబ్ అధ్యక్షుడు పులబాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లూర్థుమాత విద్యాలయం, విశ్వభారతి విద్యాలయం, యూనివర్సల్ విద్యాలయం, బాలభారతి విద్యాలయాల్లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, శానిటైజర్లు శనివారం అందజేశారు. కర్నాటి లక్ష్మారెడ్డి, జవాజి నగేశ్, దగ్గుల నారాయణరెడ్డి, దగ్గుల రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైరా, మే 21: పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మండలంలోని పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. వైరాలో 229 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
కల్లూరు రూరల్, మే 21: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, చండ్రుపట్ల సర్పంచ్ గొల్లమందల ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని చండ్రుపట్ల, బత్తులపల్లి, చెన్నూరు, కప్పలబంధం, చిన్నకోరుకొండి గ్రామాల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఎంఈవో రాములు, బోబోలు లక్ష్మణరావు, కాటమనేని వెంకటేశ్వరరావు, రాచమళ్ల నాగేశ్వరరావు, ఉబ్బన వెంకటరత్నం, నందిగం ప్రసాద్, గొల్లమందల ప్రసాద్, సింగిశాల ప్రసాద్, తడికమళ్ల నాగేంద్ర, సామేలు, కొర్రా నర్సింహారావు, బాలూనాయక్, కమ్లీ తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, మే 21: పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం కల్లూరుగూడెం పాఠశాలలోని విద్యార్థులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసిన పరీక్ష సామగ్రిని విద్యార్థులకు అందజేసి మాట్లాడారు. ఎంపీడీవో వీరేశం, సర్పంచ్ కోలా వెంకటేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తల్లాడ, మే 21: మండల పరిధిలోని కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు శనివారం పరీక్ష సామగ్రిని హెచ్ఎం శీలం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ అయిలూరి లక్ష్మీ, సొసైటీ చైర్మన్ ప్రదీప్రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
పది విద్యార్థులకు హాల్ టిక్కెట్ల అందజేత
పెనుబల్లి, మే 21: మండలంలోని కోండ్రుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం సర్పంచ్ తడికమళ్ళ సీత చేతుల మీదుగా హాల్ టిక్కెట్లను అందజేశారు. హెచ్ఎం విశ్వేశ్వరరావు, బెల్లంకొండ చలపతిరావు, తడికమళ్ల శేఖర్ తదితరులు ఉన్నారు.
సత్తుపల్లి, మే 21: ఈ నెల 23 నుంచి జరుగనున్న పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల, పట్టణ పరిధిలో ఏడు పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశామని, 1260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కస్టొడియన్ నక్కా రాజేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోని హాల్టికెట్ నంబర్లను శనివారం ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రతిపరీక్షా కేంద్రాల వద్ద మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.
సత్తుపల్లి రూరల్, మే 21: మండల పరిధిలోని కిష్టారం ఉన్నత పరిషత్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు హెచ్ఎం బాలకృష్ణ, సర్పంచ్ శెట్టిమాల రేణుక ఆధ్వర్యంలో హాల్టికెట్లు, పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు.