ఖమ్మం, ఆగస్టు 4 : ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో వంద శాతం ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులతో పోడు పట్టాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణకు హరితహారం, జీవో 58, 59 అమలు, గొర్రెల అభివృద్ధి పథకం, బీసీ బంధు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 6,509 పోడు పట్టాలు జారీ అయ్యాయని, ఒకటి కంటే ఎకువ ప్యాచెస్ ఉన్నచోట వచ్చే సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 66 పంచాయతీ భవనాలు మంజూరు చేయగా, 47 చోట్ల పనులు ప్రారంభం అయ్యాయని, మిగతా ప్రాంతాల్లో సమస్యలు పరిషరించి, పనులు ప్రారంభించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రఘునాథపాలెంలో నిర్మాణంలో ఉన్న సూల్ ఆఫ్ ఎక్స్లెన్సీ, సింగరేణిలో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు త్వరగా చేపట్టాలన్నారు.
జిల్లాలో ఈ ఏడాది 32 లక్షల మొకలు నాటడమే లక్ష్యం కాగా, ఇప్పటికే 14 లక్షలు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో బీపీఎల్ కుటుంబాలకు ఇంటి స్థలాల కోసం 2,895 ప్లాట్లకు గాను, 3,928 దరఖాస్తులు వచ్చాయని, 1,100 మంది లబ్ధిదారుల జాబితా అందినట్లు తెలిపారు. మిగతా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, అర్హుల జాబితా సమర్పించాలన్నారు. జీవో 58 క్రింద 17,000 దరఖాస్తులు రాగా, 8,000 దరఖాస్తుల విచారణ పూర్తి అయిందని, మిగతావి త్వరితగతిన పరిషరించాలన్నారు. జీవో 59 కింద రెండో విడత డిమాండ్ నోటీసులు జారీచేయాలన్నారు. వీఆర్ఏ లకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్ సీఎంఆర్ బియ్యానికి సంబంధించి మిల్లర్లు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద రెండో విడతలో 15 రోజుల్లోగా 520 యూనిట్ల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. బీసీ బంధు క్రింద వచ్చిన దరఖాస్తుల్లో స్రూటిని అనంతరం అర్హుల జాబితా సమర్పించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణు మనోహర్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఈఈ పీఆర్ కేవీకే శ్రీనివాస్, జీఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.