ఖమ్మం, అక్టోబర్ 20: అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులకు పీవో, ఏపీవోల విధులపై చేపట్టిన శిక్షణ, అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పీవో, ఏపీవోలు పోలింగ్, పోలింగ్ యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఎన్నికల అధికారులు, బ్యాలెట్ యూనిట్, ఏజెంట్ల సీటింగ్ నమూనా మేరకు చేపట్టాలన్నారు. పోలింగ్ యంత్రాల సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మాక్ పోలింగ్, పోలింగ్ సందర్భంలో సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
పోలింగ్ అధికారులు-1, 2, 3 ఎన్నికల సందర్భంలో ఏ ఏ విధులు నిర్వర్తించాలో మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలన్నారు. బూత్ ఆక్రమణ, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి, క్యూ నిర్వహణ ఎలా చేయాలి, ఓటర్ల గుర్తింపు ఏ విధంగా చేపట్టాలి, ఓటింగ్ తర్వాత క్లోజ్ బటన్, ఓటింగ్ యంత్రాల సీలింగ్, ఎన్నికల పత్రాల సీలింగ్, చట్టబద్ధమైన ఫారాలు పూరింపులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. పీవో హ్యాండ్ బుక్ పూర్తిగా చదివి తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రెయినర్లు శ్రీరామ్, మదన్ గోపాల్ పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ అధికారుల విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 20: నూతన కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను కలెక్టర్ పరిశీలించారు. సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిషార వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీ విజిల్ యాప్ ద్వారా 91 ఫిర్యాదులు రాగా పరిషరించామని, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 411 కాల్స్ వచ్చినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిషారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు అమర్చినట్లు, అట్టి సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950, 906321 1298లకు కాల్ చేసి ఫిర్యాదులు, సందేహాలు పరిషరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సీపీవో ఏ.శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు రాంబాబు, రంజిత్ ఉన్నారు.