హైదరాబాద్, జూలై 26 (నమస్తే తె లంగాణ) : కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలను జాతీయస్థాయిలో బహిర్గతం చేస్తూ ఎన్డీఎస్ఏకి ఈ-మెయిల్ ద్వారా వాస్తవాలను తెలియజేసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు తీర్థాల లక్ష్మీనరసింహగుప్తాను ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షు డు కాసర్ల నాగేందర్రెడ్డి మెల్బోర్న్లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేందర్రెడ్డి మాట్లాడు తూ.. ‘ఎన్ఆర్ఐలంటే కేవలం విదేశాల్లో నివసించేవారే కాదని, తమ పుట్టి న గడ్డపై అపారమైన ప్రేమ, బాధ్యత క లిగినవారని లక్ష్మీనరసింహగుప్తా మరోసారి నిరూపించారని కొనియాడారు.
బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏ ర్పాటుచేసే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లక్ష్మీనరసింహ గుప్తా మాట్లాడుతూ.. కాళేశ్వరం పై జరుగుతున్న కుట్రలు, అ సత్య ప్రచారాలను తిప్పికొట్టడమే తన లక్ష్యమని, అందులో భాగంగానే ఎన్డీఎస్ఏకు వాస్తవాలు అందజేసినట్టు తెలిపారు. తన పోరాటం నిరంతరం సాగుతుందని స్ప ష్టంచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సా యిరామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యారావు కాచారపు, ఉమాపతిరా వు, శ్రవణ్గుప్తా, సాయి పాల్గొన్నారు.