ఖమ్మం, జనవరి 4 : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గ్యారెంటీలతోపాటు ఇతర సమస్యలపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిషరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. అనంతరం ప్రజా పాలన కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. గ్యారెంటీ పథకాలతోపాటు ఏయే అంశాలపై ప్రజలు అధికంగా దరఖాస్తు సమర్పిస్తున్నారనే అంశాన్ని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని తెలుసుకున్న కలెక్టర్.. వాటిని కూడా స్వీకరించాలన్నారు. ప్రజా పాలన కేంద్రానికి వచ్చి సమర్పించే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, వాటిని తిరసరించడానికి వీల్లేదన్నారు. దరఖాస్తులను బల్గా తీసుకోవద్దని అధికారులకు సూచించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. దరఖాస్తు పూరించడంపై ప్రజలకు ఈ సందర్భంగా కలెక్టర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జి.జ్యోతి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్, డీఈవో సోమశేఖర శర్మ, 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.