ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బెడ్రూం గృహసముదాయాలను ఆయన పరిశీలించారు. గృహసముదాయాలలో 5వేల పైచిలుకు జనాభా నివాసం ఉంటారని, వారందరికీ ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసర వస్తువులతో పాటు, వైద్య సదుపాయం, ఇతర మౌళిక వసతులలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు.
గృహప్రవేశాలకు ముందుగానే అన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పుష్పలత, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సంధ్యారాణి, జిల్లా సర్వేలైన్స్ అధికారి రాజేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గుత్తేదారులు గోవర్ధన్రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.