మామిళ్లగూడెం, జనవరి 31: పోడు భూముల పట్టాల జారీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యకు పరిషారం లభించనుందని అన్నారు. ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి అటవీ హకుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పోడు భూములకు సంబంధించి జిల్లాలో 10 మండలాలకు చెందిన 132 ఆవాసాల నుంచి దరఖాస్తులు అందినట్లు తెలిపారు. 25,515 ఎకరాలకు హక్కు పత్రాల కోసం షెడ్యూల్ తెగల నుంచి 9,507 దరఖాస్తులు, 17,678 ఎకరాలకు హక్కు పత్రాల కోసం గిరిజనేతరుల నుంచి 8,980 దరఖాస్తులు కలిపి మొత్తం 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాల్లో హకు పత్రాల కోసం అందించినట్లు వివరించారు. క్షేత్రస్థాయి సర్వే, గ్రామసభల్లో విచారణ తదితర ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తి చేసినట్లు చెప్పారు. భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు మాట్లాడుతూ..
మిగులు ఆవాసాలకు సంబంధించి డివిజన్ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒకరికీ పట్టాల జారీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీటీడబ్ల్యూవో కృష్ణనాయక్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శ్రీనివాసులు, అటవీ అధికారులు ప్రకాశ్రావు, మంజుల, రాధిక, ప్రజాప్రతినిధులు మాలోతు ప్రియాంక, వాంకుడోతు జగన్, బానోతు బుజ్జి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో అధిక ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఐడీవోసీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఆ నిధులతో ఏయే పనులు చేపట్టాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 వేలకు పైగా జనాభా ఉండి, మున్సిపాలిటీలుగా కాని పెద్దతాండా, ఏదులాపురం, నేలకొండపల్లి, కల్లూరు, కొమ్మినేపల్లి, పాలేరు, తల్లాడ గ్రామాలకు నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు.
ముఖ్యమంత్రి హామీ నిధులతో అభివృద్ధి పనులు విభిన్నంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులు, పాలేరులో పర్యాటక అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఇది వరకే చేపట్టిన పనుల పురోగతిపైనా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇన్చార్జి డీపీవో వీవీ అప్పారావు, పీఆర్ ఈఈ కేవీకే శ్రీనివాస్, డీఎల్పీవో పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.