ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పేద,మధ్య తరగతి కుటుంబాలవారికి వైద్యచికిత్సకు అయినఖర్చుల్లో కొంత మేర ప్రభుత్వం అందించి వారికి అండగా ఉండాలని సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
మధిర నియోజకవర్గంలో ఎంతోమంది లబ్ధిదారులకు ఇప్పటికే సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని, ఆపదలో ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఎంపీడీవో అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, సర్పంచ్ మొగిలి అప్పారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, ఎంపీటీసీ మస్తాన్వలీ, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, చిన్నం రాము, ఎస్కే.బాజీ, కొండేపాటి సాంబశివరావు పాల్గొన్నారు.