ఖమ్మం : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ,మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు పేరు ఉందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రధానంగా పేదల పక్షపాతిగా అనేక ఏండ్లుగా అలుపెరగని సేవలు చేస్తూ పేదల అభ్యున్నతికి కృషిచేయడం ఆయనలోని దార్శనికతకు ప్రత్యక్ష సాక్ష్యమని కూరాకుల అన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో మంజూరైన రూ.23.23 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం నగరంలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ మహిళా రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిగొండ ఎంపిపి సామినేని హరిప్రసాద్ , టీఆర్ఎస్ జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ , చిత్తారు సింహాద్రి యాదవ్ , కార్మిక విభాగం నాయకులు కాసాని నాగేశ్వరరావు , భూపతి శ్రీనివాసరావు, ఎన్నబోయిన రమేష్,తన్నీరు రవి,వాకదాని కోటేశ్వరరావు, నామ సేవ సమితి జిల్లా అధ్యక్షులు పాల్వంచ రాజేష్, జిల్లా కార్యదర్శి చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.