తల్లాడ, డిసెంబర్1 : రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ మండలంలో కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం పినపాక, అంబేద్కర్నగర్, రెడ్డిగూడెం, మంగాపురం, గొల్లగూడెం, మల్లవరం, తల్లాడ, నారాయణపురం గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అందించి మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అందజేశామన్నారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రతిఒక్కరికీ పథకాలను వర్తింప చేస్తున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే సండ్రను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రాయల వెంకటశేషగిరిరావు, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, నారపోగు వెంకటేశ్వర్లు, శీలం కోటారెడ్డి, తేలపుట్ల స్వరాజ్యం, వరపర్ల ఉమాఉదయ్, బద్ధం నిర్మల, దుగ్గిదేవర సామ్రాజ్యం, జొన్నలగడ్డ కిరణ్కుమార్, ఏపూరి వెంకటేశ్వరరావు, రవీందర్రెడ్డి, సురేశ్, నవ్యకాంత్, అశోక్, కాంపల్లి రాము, సంగసాని శ్రీనివాసరావు, మోదుగు ఆశీర్వాదం, దగ్గుల శ్రీనివాసరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, దూపాటి నరేశ్, కాంపాటి జమలయ్య పాల్గొన్నారు.
తల్లాడ, డిసెంబర్ 1 : భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నారాయణపురంలోని ఇందిరానగర్కాలనీలో గురువారం బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ- గంగిదేవిపాడు రోడ్డుకు నిధులు : తల్లాడ నుంచి మల్లవరం మీదుగా గంగిదేవిపాడు వరకు 6.5 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం తెలిపారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంతరెడ్డిని అనేక పర్యాయాలు కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నిధుల మంజూరునకు సహకరించిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 1 : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి నాల్గవ వార్డులోని మసీద్రోడ్లో ఎఫ్ఎఫ్ఐ చర్చిలో సెమీ కిస్మస్ కేక్ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కట్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మట్టా ప్రసాద్, అనిల్, రమేశ్, వలీ, రవికిరణ్, కిరణ్రంజని తదితరులు పాల్గొన్నారు.