ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అపరాల సాగురైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. ఈ సంబురాల్లో భాగంగా ఖమ్మం రైతులు సీఎం కేసీఆర్ కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మక్క, కంది,పెసరలతో సీఎం కేసీఆర్ భారీ చిత్రాన్ని రూపొందించారు.
ధాన్యాలతో 1000 అడుగుల విస్తీర్ణంలో కేసీఆర్ చిత్రాన్ని ఖమ్మం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, సీనియర్ నాయకులు నున్న మాధవరావు, తోట వీరభద్రం, సాయి కిరణ్,పత్తిపాక రమేష్, వ్యవసాయ మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.