మణుగూరు టౌన్/బూర్గంపహాడ్/సారపాక, నవంబర్ 13: బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం ఆశీర్వాద సభకు జనం ప్రభంజనంలా పోటెత్తారు. సభకు ముందు కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. వేదిక ముందు జన ప్రభంజనాన్ని చూసిన బీఆర్ఎస్ నాయకులు.. ‘సభ విజయవంతం.. మన గెలుపు ఖాయం’ అనే ధీమాతో, ఆనందంతో కళాకారులతో కలిసి వేదికపై స్పెప్పులేశారు. అభ్యర్థి రేగా కాంతారావు కూడా ‘విజయా’నందంతో వారితో కలిసి ఆడారు. తెలంగాణతోపాటు ఇతర దేశాల్లోనూ హోరెత్తుతున్న ‘గులాబీ జెండాలమ్మా రామక్క… గుర్తు గుర్తుంచుకో రామక్క… కారును గుర్తుంచుకో రామక్క’ పాటను ఏపూరి సోమన్న ఆలపించారు. దీనికి ఎమ్మెల్యే అభ్యర్థి కాంతారావు నర్తించారు. ఆయనకు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత కూడా జత కలిశారు. వేదికపై ఇలా పార్టీ పెద్దలు.. వేదిక ముందు బీఆర్ఎస్ శ్రేణులు.. స్పెప్పులతో సందడి సందడి చేశారు.
బూర్గంపహాడ్, నవంబర్ 13: లక్ష్మీపురం సభావేదికపై ఆసీనులైన సీఎం కేసీఆర్కు జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత పుష్పగుచ్ఛం అందించారున. తన మండలంలోని లక్ష్మీపురంలో సభకు రావడం ఎంతో ఆనందంగా ఉందని సీఎంతో అన్నారు.
సారపాక, నవంబర్ 13: సభానంతరం తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్కు హెలీప్యాడ్ వద్ద నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ కోనేరు చిన్ని, అభ్యర్థి రేగా కాంతారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్సీ, భద్రాచలం ఇన్చార్జ్ తాతా మధు కలిసి వీడ్కోలు పలికారు.
మణుగూరు టౌన్/ఆళ్లపల్లి/కరకగూడెం, నవంబర్ 13: బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో సీఎం సభకు మణుగూరు, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
మణుగూరు టౌన్, నవంబర్ 13: రేగా కాంతారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని విజయనగరం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యం బాబు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం విస్తృతంగా ప్రచారం చేశారు. బుద్దరాజు నవీన్బాబు, మట్టపల్లి సాగర్ యాదవ్, పెండ్యాల నాగేశ్వరరావు, కంటే సురేష్, తాడిపల్లి ప్రభుదాస్, అక్కి నర్సింహారావు, సోయం కృష్ణ, కంపెర్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పినపాక, నవంబర్ 13: మండలంలో నాయకులు ప్రచారం చే శారు. భద్రయ్య, బాడిశ మహేష్, మొగిలిపల్లి నర్సింహారావు, పటేల్ కామేశ్వరరావు, పూనెం నర్సింహారావు, సుతారి నరేష్ పాల్గొన్నారు.