జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. తమ రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని జేపీఎస్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించి, జిల్లాస్థాయిల్లో కమిటీలు వేసి తమ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సంబురాలు నిర్వహించారు. అన్ని చోట్లా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 23