ఖమ్మం రూరల్, జూన్ 30 : బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వమే నిర్వహించాలని, క్లైములను వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగించాలని, లక్షల రూపాయలు దుర్వినియోగం చేసే సీఎస్సీ హెల్త్ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిధులను ప్రైవేటు కంపెనీ అప్పజెప్పిన నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన బిల్డింగ్ వర్కర్స్ అందరికీ రూ.6 వేలు వేలు పెన్షన్ ఇవ్వాలని, చదువుతున్న విద్యార్ధిని విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని, ఇల్లు ఇళ్ల స్థలాలు లేని బిల్డింగ్ వర్కర్స్ కు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్ రావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రూరల్ మండల అధ్యక్షుడు, కార్యదర్శి పూరెల్లి రాములు, గూడెం బ్రహ్మం గౌడ్, మండల నాయకులు గండి నాగయ్య, పెనుగొండ వీరయ్య, నాయకులు యర్రా మల్లికార్జున్ తీగుళ్ల వెంకటరమణ, అమరబోయిన, లింగయ్య, నగేష్, రమణ, దిగచర్ల వెంకన్న పాల్గొన్నారు, అనంతరం రూరల్ మండల డ్యిపూటి తాసీల్దార్ సంపత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు.