ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. వైరా, మధిర ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మధిరలోని ఆత్కూరు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా వైరాకు చేరుకొని అక్కడి సభలో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ గెలుపును కోరుతూ ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర అభ్యర్థి లింగాల్ కమల్రాజు, వైరా అభ్యర్థి మదన్లాల్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభలకు తరలివచ్చేందుకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
ఖమ్మం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభల్లో పాల్గొననున్నారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మధిరలోని ఆత్కూరు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా వైరాకు చేరుకొని అక్కడి సభలో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. అక్టోబర్ 27 నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధినేత ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ ఆశీర్వాద సభలకు ప్రతి చోటా అనూహ్య స్పందన లభిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంటోంది.
ఇదే క్రమంలో వైరా, మధిర నియోజకవర్గాల్లో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొనుండడంతో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో సభలు పూర్తయినట్లవుతోంది. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు కలిపి బూర్గంపహాడ్ మండలంలో ఒకేచోట సభను నిర్వహించారు. కాగా, మధిర, వైరా సభల కోసం భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండడంతో పార్టీ నేతలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కూడా సోమవారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా వేదికల ఏర్పాట్లను జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల్ కమల్రాజు, వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పరిశీలించారు.