కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 19 : జిల్లా కేంద్రంలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన రాఘవ, అమృత్ చౌహాన్, సర్దార్ పుటం పరిశీలించారు.
హెలిపాడ్ కోసం ప్రగతి మైదానాన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి, పార్టీ నాయకులు కోనేరు చిన్ని, జేవీఎస్ చౌదరి, యూసుఫ్, మోరె భాస్కర్, రమేశ్, లగడపాటి రమేశ్, కొట్టి వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీను, హైమద్ పాల్గొన్నారు.