మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. అనంతరం జడ్పీచైర్మన్ కమల్ రాజు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మధిర పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, ఆర్.వీ, ఆర్.వెంకటేశ్వరరావు, నల్లమల గోపిస్వామి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, కోన నరేందర్రెడ్డి, నల్లమల శ్రీనివాసరావు, సాయి, ఉపేంద్ర, బాహాటం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.