నల్లనేలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ బూటకమని తేలిపోయింది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండం ప్రజల సాక్షిగా ఆయన ప్రకటించి నెలరోజులు కాకముందే కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కచ్చితంగా వేలం వేస్తామని పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించడం విమర్శలకు తావిస్తున్నది. తమ వాటా తక్కువుందంటూనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సింగరేణి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసేలా అడుగులు వేస్తున్న కేంద్రం తీరుపై కార్మిక లోకం భగ్గుమంటున్నది. మరోవైపు సంస్థను కాపాడుకునేందుకు కార్మిక సంఘాల నాయకత్వం ఆందోళనలకు సిద్ధమవుతున్నది. నేడు కార్మికులు అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా.. సింగరేణి ప్రైవేటీకరణపై పోరుకు నేటి(శుక్రవారం)తో యేడాది పూర్తయింది.
మంచిర్యాల, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతిని ధి): కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది. ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే, పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో లోకసభ సాక్షిగా కేంద్రం మాట తప్పింది. సింగరేణి గనుల వేలంపై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లా ద్ జోషి చేసిన ప్రకటన సింగరేణి ఉనికినే ప్రశ్నార్థకం చే సే విధంగా ఉం ది. దీనిపై కార్మికలోకం భగ్గుమంటున్న ది. మరోవైపు ఆందోళనకు సిద్ధమవుతామని కార్మిక సం ఘాల నా యకత్వం ప్రకటిస్తున్నది.
దేశవ్యాప్తంగా 38 బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, 20 గనుల వేలం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. సింగరేణిలోని కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి గనులను వేలం వేయనున్నామని తెలిపారు. దీ నిపై టీఆర్ఎస్ ఎంపీలు తీ వ్రస్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్పరం కా నివ్వబోమని స్పష్టంచేశారు. కేంద్రం వైఖరిని మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ ని, కేంద్రానిదే బాధ్యతని హెచ్చరించారు.
‘సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కాగా, రాష్ట్రం వాటా 51 శాతం ఉన్నది. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. అలాంటప్పుడు కేంద్రం ఏకపక్షంగా సింగరేణిని ప్రైవేటీకరించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. రామగుండం బహిరంగ సభలో ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి.. చట్టసభల్లో ప్రైవేట్పరం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం బీజేపీ ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నది. కాగా, వే లం లిస్టులో ఉన్న నాలుగు బొగ్గుబ్లాకుల్లో నిక్షేపాల ను గుర్తించేందుకు సింగరేణి సంస్థ రూ.55 కోట్లు ఖ ర్చు పెట్టింది. తీరా ఇప్పుడు వాటిని కేంద్రం వేలాని కి పెట్టడంతో సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ హయాంలో క్యాపిటివ్ మైనింగ్ను కమర్షియల్ మైనింగ్గా మార్చగా, తాజాగా బీజేపీ ప్ర భుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ గనుల ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కో యగూడెం బ్లాక్ను ప్రైవేటుకు దారాధత్తం చేసింది.
అన్ని కంపెనీల్లాగే సింగరేణి కూడా ఇక వేలంలో పా ల్గొనాలని కేంద్రం స్పష్టం చేసింది. వేలంలో పాల్గొని కావాల్సిన బ్లాక్ను దక్కించుకోవచ్చని వాదిస్తున్నది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన డం కన్నా.. గతంలో మాదిరిగా నామినేషన్ పద్ధతి లో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు బ్లాక్లు కేటాయించాలనే డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇప్పటికిప్పుడు సింగరేణికి 10 బ్లాక్లు ఇచ్చి రెండు, మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ఇచ్చినా చేసే శక్తి, సామర్థ్యం సంస్థకు ఉన్నాయి. పుష్కలమైన వనరులతో పాటు మ్యాన్పవర్ ఉంది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొన్ని ఎక్స్టర్నల్ భర్తీలు చేపట్టడంతో సంస్థకు 18వేల మ్యాన్పవర్ ఏర్పడింది. మొత్తం యువరక్తమే.. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ సింగరేణి సొంతం. ఇప్పటికే చాలాసార్లు ఇది నిరూపితమైంది. ప్రస్తుతం సింగరేణి లీజ్కు తీసుకున్న బ్లాక్లలో బొగ్గు ఉత్పత్తి మరో 20 నుంచి 25 ఏళ్లలో అయిపోతుంది. ఇక గనులను ప్రైవేట్కు అప్పగించుకుంటూ పోతే సింగరేణి సంస్థ అనేది ఒక టి ఉండేది అని చెప్పుకునే రోజులు రావచ్చనేది కొందరి వాదన. మరోవైపు సింగరేణి ఉసురు తీసేం దుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనను ఆయన ఖండించారు. వేలం అంటూ తాళం వేసే దాకా తీసుకెళ్తారని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని, సంస్థను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై కక్ష కట్టి, సింగరే ణిపై కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
రామగిరి, డిసెంబర్ 8: సింగరేణికి కే టాయించాల్సిన బొగ్గు గనులపై తెలం గాణపై ఉన్న విద్వేషాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి పూనుకున్న బీజేపీ ప్రభు త్వానికి దేశ వ్యాప్త సమ్మెతో గుణపాఠం చెప్పక తప్పదు. జాతి సంపదను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టే హక్కు ప్రధాని మోదీకి లేదు. అది ప్రజా సంపద. అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతామంటే ఊరుకునేది లేదు.
-జూపాక రాంచందర్, ఏఐటీయూసీ
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 8: కోట్ల రూపాయలు వెచ్చించి సర్వే చేసిన సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులను ఎలాంటి షరతులు లేకుండా అప్పగించాలి. గతంలో మాదిరిగానే ఈ ఏరియాలో ఉన్న ఏ బొగ్గు బ్లాక్ అయి నా సింగరేణికి అప్పగిస్తే, ఎన్నో కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరో క్షంగా మేలు జరుగుతుంది.
-మహేశ్, టర్నర్, సెంట్రల్ వర్క్షాప్, కొత్తగూడెం
రాష్ట్రంపై కేంద్రం అన్ని విధాలుగా కుట్రలు చేస్తున్నది. సింగరేణి సంస్థను ప్రైవేట్పరం చేయాలనుకునే కుయుక్తుల ను మానుకోవాలి. ప్రధానమంత్రి సింగరేణిపై రోజుకో మాట మాట్లాడుతూ మో సం చేస్తున్నారు. వెంటనే నాలుగు బ్లాకుల వేలా న్ని రద్దు చేసి, సింగరేణికివ్వాలె. లేకుంటే కేంద్రాన్ని వదలం.
-తిప్పారపు ఎల్లయ్య, ఫిట్టర్, పీవీకే5
రామగిరి, డిసెంబర్ 8: సింగరేణికి ఇవ్వాల్సిన బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరగబడితే బీజేపీ గద్దె దిగక తప్పదు. ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డయ్. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఉద్యమ సెగ మరోసారి చూపిస్తాం. ప్రజా సంపదను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదు. కేంద్రంపై మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులం తా సిద్ధం కావాలి, సంస్థను కాపాడుకునేందుకు ఐక్యంగాముందుకెళ్లాలి.
-గౌతం శంకరయ్య, టీబీజీకేఎస్
తాండూర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం, మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే. వారు చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఉట్టి మాటలతో కాలం వెళ్లదీస్తున్నా రు. సాక్షాత్తు ప్రధానమంత్రే పచ్చి అబద్ధాలు మాటలు మాట్లాడితే ఏం చేయాలి..? బహి రంగ సభల్లో ప్రజల ముందు ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి, పార్లమెంట్లో ప్రైవేటీ కరణ చేస్తామని చెబుతున్నారు. సింగరేణిలో నాలుగు బ్లాక్ల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలి. కార్మికుల ఆగ్రహం బీజేపీ నాయకు లకు తప్పకుండా తాకుతుంది.
-గుడెల్లి వైకుంఠం, జనరల్ మజ్దూర్, ఏరియా వర్క్షాప్
తాండూర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభు త్వంలో ఉన్న నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు. ప్రజలు ఎవరి మాట నమ్మాలే. రామగుండం సభలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మోదీ అన్నరు.. కానీ, బొగ్గు బ్లాక్ల వేలం కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర మంత్రి అంటరు. ఇలా మనిషికో రకంగా, పూటకో రకంగా మాటలు మారిస్తే ఎలా..? కార్మికులను దగా చేస్తున్న బీజేపీకి కాలం చెల్లే రోజు దగ్గర్లోనే ఉంది.
-ముల్కల చంద్రయ్య, జనరల్ మజ్దూర్, ఏరియా వర్క్షాప్
తాండూర్, డిసెంబర్ 8: దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అ మ్మేస్తోంది. సింగరేణిని కూడా అమ్మేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. తమకు వాటా తక్కువ ఉందని, వట్టి మాటలు చెబుతూ, వెను కాల తన పని తాను చేస్తున్నది. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడం సరికాదు. నోటితో మాట్లా డి నొసటితో వెక్కిరించే ధోరణి కేంద్రానిది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఆటలు సాగనివ్వం. కార్మిక లోకం అంతా కలసికట్టుగా కేంద్ర ప్రభుత్వ విధానా లను తిప్పి కొడతాం కచ్చితంగా బీజేపీకి దేశవ్యాప్తంగా కార్మికుల నుంచి వ్యతిరేకత తప్పదు. కార్పొరేట్ శక్తులకు మంచి చేసేందుకు సామన్య కార్మికుల పొట్టకొట్టడం సరికాదు.
-ఎండీ దస్తగిరి, ఈపీ ఆపరేటర్, అబ్బాపూర్ ఓసీపీ
“సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. బొగ్గు బావులను వేలం వేయడం అంటే తాళం వేయడమే. ప్రైవేట్ పరం చేసి తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నది. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది.” అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.