టేకులపల్లి, సెప్టెంబర్ 20: సీఎం కేసీఆర్ సహకారం వల్లనే నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరయ్యాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఆ నిధులతోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని అన్నారు. టేకులపల్లి మండలంలో బుధవారం పర్యటింటిన ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు.. తొలుత టేకులపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తొమ్మిదోమైలుతండా – కోటల్ల మధ్య రూ.3 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ జర్పుల బిచ్చా అధ్యక్షతన శంకుస్థాపన చేశారు. అనంతరం తొమ్మిదోమైలుతండాలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. బేతంపూడిలో రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మద్రాస్తండాలో సర్పంచ్ మాలోత్ రాజేందర్ అధ్యక్షతన మద్రాస్తండా – గంగపురం మధ్య రూ.కోటితో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే, మద్రాస్తండా, కొండంగులబోడు, మాలపల్లి, కొత్తతండా గ్రామలలో సీసీ రోడ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. మొత్తం రూ.4 కోట్లతో నిధులతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు. అలాగే, మరో రూ.1.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభించినట్లు వివరించారు. నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న బీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, బానోత్ హరిసింగ్నాయక్, భూక్యా రాధ, జర్పుల బిచ్చా, మాలోత్ రాజేందర్, భూక్యా శాంతి, జాలది అప్పారావు, వీ.ఉమాదేవి, బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బోడు బాలునాయక్, బానోత్ రామానాయక్, బానోత్ కిషన్నాయక్, లక్కినేని శ్యామ్బాబు, దళపతి శ్రీనివాసరాజు, కంభంపాటి చంద్రశేఖర్రావు, భూక్యా పాపానాయక్, బానోత్ రవికుమార్, అనంతుల శ్రీనివాస్, జాటోత్ నరేశ్, జర్పుల లచ్చునాయక్, కుమ్మరి కిరణ్, కాలే ప్రసాద్, గుగులోత్ కృష్ణ, జర్పుల రాజు, ఆంగోత్ లఘుపతి, జయరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.