ఎర్రుపాలెం: ఎర్రుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు మాడపాటి హనుమంతరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో “చదువుకు చేయూత కార్యక్రమం” నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.
అనంతరం మాడపాటి హనుమంతరావు కుటుంబసభ్యులు సరోజిని, సతీష్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మురళీమోహన్రావు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు, పూర్వవిద్యార్థిసంఘం సభ్యులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.