ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఊరూరా ప్రచారంలో నిమగ్నమైన ఎమ్మెల్యే అభ్యర్థులకు మహిళలు పూలు చల్లుతూ.. తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటు వేయాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించారు.
కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని, ఎమ్మెల్యేలుగా తమను గెలిపిస్తే అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని, సంక్షేమం మరింత రెట్టింపు అవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.