పెనుబల్లి, నవంబర్ 3: సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళపెంట గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు ఆయనకు మేళతాళాలతో ఘనస్వాగతం పలుకగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులు సైతం మీకు ముందు మేముంటాం మా గ్రామంలోకి రా అంటూ వృద్ధులు నడుచుకుంటూ వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. తాళ్లపెంట ఎస్టీ కాలనీకు చెందిన మహిళలు కోలాట నృత్యాలు చేశారు.
పెనుబల్లి, నవంబర్ 3: వీ.ఎం.బంజరలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించగా మహిళలు హారతులు ఇచ్చి, బొట్టు పెట్టి ఘనస్వాగతం పలికారు. ఆయన హుషారుగా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వీ.ఎం.బంజర యువకులు పలువురు పార్టీలోకి చేరగా వారికి ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో నాయకులు కనగాల వెంకట్రావు, భూక్యా ప్రసాద్, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, మందడపు అశోక్కుమార్, రాయపుడి మల్లయ్య, ద్వాలి, సూరపురెడ్డి కిరణ్రెడ్డి, కొత్తగుండ్ల అప్పారావు, కాకా సీతారాములు, మరకాల నర్వోత్తమరెడ్డి, గువ్వల వెంకటరెడ్డి, సూరపురెడ్డి నరసింహారెడ్డి, వంగా గిరిజాపతి, ఝాన్సీనిరంజన్గౌడ్, చిన్నపండు, కొత్తగుండ్ల అప్పారావు, కోటగిరి సుధాకర్బాబు, లగడపాటి శ్రీను, సురపురెడ్డి కిరణ్రెడ్డి, నర్వోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, నవంబర్ 3 : శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తన ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. తెల్లవారుజామున పట్టణంలోని హనుమాన్నగర్లో ఉన్న భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రచార రథానికి పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కూసంపూడి మహేశ్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వనమా వాసు, మట్టా ప్రసాద్, నరుకుళ్ల శ్రీనివాసరావు, యాగంటి శ్రీనివాసరావు, రఫీ, చల్లగుళ్ల కృష్ణయ్య, మౌలాలి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్ 3: సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరకయ్య విజయాన్ని కాంక్షిస్తూ తల్లాడలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి సండ్రను మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దూపాటి భద్రరాజు, జీ.వీ.ఆర్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, గుండ్ల వెంకటి, దగ్గుల రాజశేఖర్రెడ్డి, దూపాటి నరేష్రాజు, ఎస్.కే.యూసూబ్, చల్లా నాగులు, గుడిబండ్ల మహేశ్, తిరుపతిరావు, రంగారావు పాల్గొన్నారు.
వేంసూరు, నవంబర్ 3: రామన్నపాలెం గ్రామంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల్లోకి తీసుకుపోవడానికి శుక్రవారం గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ నాగుల్మీరా, ఎంపీటీసీ, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల లక్ష్మీశంకర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నూనె హరిబాబుయాదవ్, పదిలం సాయిబాబు, కొండపల్లి శ్రీనివాసరావు, ఆముదాల వెంకటేశ్వరమ్మ, పింగలి నరేశ్, నూనె శ్రీనివాసరావు, ఆముదాల శ్రీనివాసరావు, బెల్లం కోటయ్య, ధర్మరాజుల కేశవరావు, పడకంటి శంకర్, కొప్పుల యోహాను, జూపూడి లక్ష్మణరావు, నక్క రాజా, నూనె నరసింహారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, నవంబర్ 3 : సదాశివునిపాలెంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి పంపిణీ చేస్తూ సండ్రను గెలిపించాలని శుక్రవారం ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సండ్రను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మందపాటి సూర్యప్రకాశ్రెడ్డి, తుంబూరు దామోదర్రెడ్డి, కాలినేని వెంకటేశ్వరరావు, పర్సా కృష్ణ, కందుకూరి కృష్ణ, కర్నాటి భద్రం, రాజేశ్, సాంబశివరావు, కోటమర్తి కృష్ణ, మామిళ్ల వెంకటేశ్వరరావు, ఆళ్ల రమేశ్, బండి రంగారెడ్డి, తుంబూరు నాగిరెడ్డి, శ్రీనివాసరావు, కొండలు, వినుకొండ వెంకటవీరయ్య, బొలుసుపాటి మారేశ్వరరావు, మరీదు శివ, కందుకూరు రమేశ్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.