సత్తుపల్లి, అక్టోబర్ 15: తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మేనిఫెస్టో ప్రకటించడం పట్ల సత్తుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రింగ్సెంటర్లో సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ మాట్లాడుతూ ప్రమాదబీమా, కేసీఆర్ భీమా…కుటుంబాలకు ధీమా పథకం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్సిలిండర్, ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకాలను మేనిఫెస్టోలో చేర్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీఠం అధిరోహిస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు చల్లగుళ్ల కృష్ణయ్య, షేక్ రఫీ, అంకమరాజు, వల్లభనేని పవన్, మేకల నర్సింహారావు, గఫార్, రాజ్కుమార్, పర్వతనేని వేణు, రామిశెట్టి కృష్ణ పాల్గొన్నారు.
పెనుబల్లి, అక్టోబర్15: తెలంగాణ పేద, ధనిక, మధ్య తరగతి రైతులు, మహిళలు అందరూ ఆమోదయోగ్యమైన అభివృద్ధి చెందే మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, దీంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి పోయిందని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోకు మద్దతుగా సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సండ్రకు బీఫాం అందజేయడం పట్ల వారు రింగ్సెంటర్లో పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ చరిత్రలోనే లిఖించ తగ్గ మేనిఫెస్టో అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రసాద్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, నాయకులు లక్కినేని వినీల్, కోటగిరి సుధాకర్బాబు, కొత్తగుండ్ల అప్పారావు, తేజావత్ తావునాయక్, తడికమల్ల తాతారావు, కాకాటి ప్రకాశ్, ఎలమర్తి శ్రీను, గంధం దుర్గయ్య, నరుకుళ్ల సత్యనారాయణ, ఎస్కే గౌస్, వంగా గిరిజాపతి, మల్లెల సతీశ్, మల్లెల శ్రీను, పానెం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేంసూరు, అక్టోబర్15: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టోను విడుదల చేయడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుగా తీసుకెళ్లడంతో పాటు,రానున్న రోజుల్లో ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మెనిఫెస్టోను విడుదల చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, పార్టీ కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, దొడ్డా వెంకటకృష్ణారావు, దొడ్డ చిన్నకేశవరెడ్డి, లచ్చగూడెం సొసైటీ చైర్మన్ గండ్ర సోమిరెడ్డి, జాబిశెట్టి కోటేశ్వరరావు, కో ఆప్షన్సభ్యులు రహీం, యాకుబ్, రాయల మోహన్రావు, కిన్నెర రాము, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, అక్టోబర్15: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజారంజకమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు అన్నారు. మేనిఫెస్టో విడుదల చేసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బీఫాం అందించడం పట్ల తల్లాడ రింగ్రోడ్డులో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. నాల్గోసారి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. కార్యక్రమంలో నాయకులు జీవీఆర్, షేక్ యూసూఫ్, బొడ్డు వెంకటేశ్వరరావు, దగ్గుల రాజశేఖర్రెడ్డి, గుండ్ల వెంకటి, చల్లా నాగులు, తేళ్లూరి రఘు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, అక్టోబర్ 15: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం, సత్తుపల్లి నియోజకర్గ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బీఫారం అందించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రింగ్ సెంటర్లో మిఠాయిలు పంచి పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు చెక్పెట్టే విధంగా ఉందని, చేసిన అభివృద్ధిని గడపగడపకూ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్రను నాల్గవసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, కమ్లీ, నాయకులు పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, కృష్ణ, గుర్రం శ్రీనివాసరావు, రాచమళ్ల నాగేశ్వరరావు, చారుగండ్ల సందీప్, కాటేపల్లి రజనీకాంత్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కట్టా అర్లప్ప, బానోత్ కృష్ణ, బైర్ల కాంతారావు, కంభంపాటి పుల్లారావు, రామడుగు ప్రసాద్, కిరణ్, ఏనుగుల అంజి, యంగల పెంటయ్య, వెంకటేశ్వర్లు, పుల్లాచారి, బీరవల్లి పురుషోత్తం, రామకృష్ణ, రాంబాబు, రమేశ్, శేఖర్, సురేశ్, నాగిరెడ్డి, ఇసాక్, చారి, జానీ పాల్గొన్నారు.