అన్నపురెడ్డిపల్లి, జనవరి 5: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీటీసీ అయిలూరి కృష్ణారెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసి పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, గెలుపోటములు సర్వ సాధారణమన్నారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలన్నారు. పార్టీకి పూర్వవైభవం వచ్చేలా పని చేయాలన్నారు. హైదరాబాద్లో ఈనెల 9న జరుగనున్న పార్టీ ఖమ్మం పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి ముఖ్యనాయకులంతా తరలిరావాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ భారత లాలమ్మ, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, సర్పంచ్ చిరంజీవి, నాయకులు లక్ష్మణరావు, నర్సారెడ్డి, నరసింహ, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, చల్లా రాంబాబు, రంగా, పుల్లారావు, వెంకన్న పాల్గొన్నారు.