భద్రాచలం, డిసెంబర్ 24: అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే అని, భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం ఆయన రిటైర్డ్ డిప్యూటీ ఎండోమెంట్ కమిషనర్ రామకృష్ణంరాజు ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పుడే మనం ప్రజలకు చేరువవుతామన్నారు. భద్రాచలంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సీనియర్ నాయకులు మానె రామకృష్ణ, ఎస్ఏ రసూల్, ఆలీంఖాన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, రమాకాంత్, పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : విప్ రేగా
మణుగూరు టౌన్, డిసెంబర్ 24: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో జరిగిన సింగరేణి డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. తొలుత సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఆయన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించాక సింగరేణి ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఎస్వోటూ జీఎం లలిత్కుమార్, సేవా అధ్యక్షురాలు జి.సునీత వెంకటేశ్వరరెడ్డి, ఏజీఎం నాగేశ్వరరావు, ఏజీఎం(ఈఅండ్ఎం) ఫిడ్స్ గర్ల్, ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, పీకేవోసీ పీవో లక్ష్మీపతిగౌడ్, పీవో ఎంఎన్జీవోసీ శ్రీనివాసచారి, రమేశ్, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.