ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వడివడిగా పుంజుకున్నది. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఆయా అభ్యర్థులు సెంటిమెంట్ మేరకు నామినేషన్ పత్రాలతో కుటుంబ సభ్యులతో సహా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి అట్టహాసంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, వైరాలో బానోతు మదన్లాల్, మధిరలో లింగాల కమల్రాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో రేగా కాంతారావు, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో బానోతు హరిప్రియానాయక్, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు నామినేషన్లు దాఖలు చేశారు.సత్తుపల్లిలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో కలిసి సండ్ర, ఇల్లెందులో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి హరిప్రియ, వైరాలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మదనల్లాల్ పండుగ వాతావరణంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఖమ్మం, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు గురువారం తమ ఇష్టదేవతలకు మొక్కి, అమ్మానాన్నల ఆశీర్వాదాలు తీసుకుని వందీమాగధులతో కలిసి గురువారం అట్టహాసంగా నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని పది నామినేషన్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొన్నది. బీఆర్ఎస్ నుంచి పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు, భద్రాచలం అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు, సత్తుపల్లి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య, మధిర అభ్యర్థిగా లింగాల కమల్రాజు, వైరా అభ్యర్థిగా బానోతు మదన్లాల్, ఇల్లెందు అభ్యర్థిగా బానోతు హరిప్రియానాయక్, అశ్వారావుపేట అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు పత్రాలు దాఖలు చేశారు. కాగా.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు.
ఖమ్మం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మిరియాల రామకృష్ణ, బీఎస్పీ అభ్యర్థిగా అయితగాని శ్రీనివాసరావు, సీపీఎం అభ్యర్థిగా ఎర్రా శ్రీకాంత్, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులుగా లిక్కి కృష్ణారావు, మిట్టకోల దినేష్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా హెచ్చు సునీల్, స్వతంత్ర అభ్యర్థులుగా ఇనపనూరి దుర్గ, ఎల్లంటి కోటయ్య, రైసీ అన్వర్, షేక్ జమీల్, అంతోటి సురేశ్, నజీమా బేగం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
సత్తుపల్లి నుంచి : సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గురువారం పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో నంబూరి శిరీషారావు, నాగపోగు ప్రసాదరావు, గద్దల సుబ్బారావు, మేడి బసవయ్య, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి శీలం వెంకటేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్కుమార్, మిక్కిలి గాంధీ నామినేషన్లు దాఖలు చేయగా
మధిర నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లింగాల కమల్రాజు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు భట్టివిక్రమార్క, సీపీఎం అభ్యర్థిగా పాలడుగు భాస్కర్, బీఎస్పీ అభ్యర్థిగా చెరుకుపల్లి శారద, స్వతంత్ర అభ్యర్థులుగా బమ్మెర రామ్మూర్తి, తడికమళ్ల నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు.
పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాళ ఉపేందర్రెడ్డి మరో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం, బీజేపీ అభ్యర్థిగా నున్నా రవికుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.
వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బానోతు మదన్లాల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలోతు రాందాస్, బీఎస్పీ అభ్యర్థిగా బానోతు రాంబాబు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అభ్యర్థిగా బానోతు దుర్గాప్రసాద్, జనసేన అభ్యర్థిగా తేజావత్ సంపత్కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.
పినపాక నుంచి : పినపాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు, బీఎస్పీ అభ్యర్థిగా వజ్జా శ్యాములు, బీజేపీ అభ్యర్థిగా పొడియం బాలరాజు, స్వతంత్ర అభ్యర్థులుగా బట్టా విజయ్గాంధీ, పాల్వంచ దుర్గ, వజ్జా జ్యోతిబసు, పూనెం రాజేష్ నామినేషన్లు దాఖలు చేశారు.
కొత్తగూడెం నుంచి : కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఏకంగా 11 మంది అభ్యర్థిలు నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పత్రాలు సమర్పించారు. జనసేన అభ్యర్థిగా లక్కినేని సురేందర్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల జీవన్, స్వతంత్ర అభ్యర్థులుగా తుమ్మలపల్లి రాంబాబు, పోతుల యాదగిరి, కొమరం బుచ్చయ్య, అవుట్పల్లి రామలింగేశ్వరరావు, కల్తీ లెనిన్, ముక్కు వెంకటనర్సారెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, దొడ్డపనేని శేషగిరిరావు నామినేషన్లు దాఖలు చేశారు.
భద్రాచలం నుంచి: భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొదెం వీరయ్య, బీఎస్పీ అభ్యర్థిగా ఇరపా రవికుమార్, సీపీఎం అభ్యర్థులుగా కొర్సా చిలకమ్మ, కారం పుల్లయ్య, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా మడకం మిత్ర, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా రవ్వా భద్రమ్మ, స్వతంత్ర అభ్యర్థులుగా ఉబ్బా సీతారాములు, నక్కా సాయిబాబు తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇల్లెందు నుంచి : ఇల్లెందు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోతు హరిప్రియానాయక్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య, బీజేపీ అభ్యర్థిగా ధరావత్ రవీందర్నాయక్, సీపీఎం అభ్యర్థిగా దుగ్గి కృష్ణ, బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా రమణాల లక్ష్మయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా భూక్యా మంగీలాల్, మెచ్చు ఉషారాణి, పోలెబోయిన రవి, సువర్ణపాక నాగేశ్వరరావు, మోకాళ్ల కృష్ణ, ముక్తి రాజు, గుగులోతు భద్రు, గుమ్మడి అనురాధ, వెంకట ప్రవీణ్కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.
అశ్వారావుపేట నుంచి సీపీఎం అభ్యర్థిగా పిట్టల అర్జునరావు, బీఎస్పీ అభ్యర్థిగా మడకం ప్రసాద్, ఇండియన్ ప్రజా పార్టీ అభ్యర్థిగా మూడ్ రవిచందర్, గోండ్వానా పార్టీ అభ్యర్థిగా ఊకే రవి, సీపీఐ నుంచి గొగ్గెల ఆదినారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా సున్నం నాగమణి నామినేషన్లు దాఖలు చేశారు.