తాము విజయతీరాలకు చేరేలా బీఆర్ఎస్ అభ్యర్థులు, తమ నాయకుడిని విజయ తీరాలకు చేర్చేలా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గురువారం ఓటింగ్లో భాగస్వాములయ్యారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులైన పువ్వాడ అజయ్కుమార్, రేగా కాంతారవు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోత్ మదన్లాల్, లింగాల కమల్రాజ్, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక, సీపీ విష్ణు వారియర్, ఎస్పీ వినీత్, నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. వీరుగాక, ఇతర ప్రజాప్రతినిధులు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.