ఖమ్మం, నవంబర్ 14: కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను, ఇటీవల మంత్రి పదవి ఇచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మోసం చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనలో త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, చెందుతోందని స్పష్టం చేశారు. కానీ పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే అక్కడి అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇక్కడి వాడినని, ఇకడే చదువుకున్నానని అన్నారు. కానీ ఖమ్మంపై తనకు ఉన్నంత ప్రేమ బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఉండదని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన ఆయన.. త్రీటౌన్ని 33, 34, 35, 36 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. తాను ఖమ్మం బిడ్డనని, అందుకే ఇక్కడి ప్రజలు తనను ఆదరించి రెండు సార్లు గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా మరోసారి గెలిపించాలని కోరారు. గతంలో తనపై గెలవలేక పోయిన తుమ్మల నాగేశ్వరరరావు.. ఈ ఎన్నికల్లో తన నామినేషన్ను తిరసరించాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు జీవితమంతా అధర్మపోరాటమేనని అజయ్ విమర్శించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ ఎదగనివ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఇకముందు కూడా ఖమ్మం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఖమ్మాన్ని నేడు ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. సీఎం కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆయనను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, తోట ఉమారాణి, వీరభద్రం, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, పసుమర్తి రామ్మోహన్రావు, నున్నా మాధవరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు, మాటేటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.