Khammam | మధిర : ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలంలోని మాటురుపేట గ్రామానికి చెందిన గడ్డం సుబ్బారావు అధ్యక్షత శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక సన్నివేశాలను, ఏకపాత్రాభినయ పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ నిర్వాహకులు తెలిపారు.
ఇవాళ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం కళాపరిషత్తు గౌరవాధ్యక్షులు,ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ పుతుంబాక కృష్ణ ప్రసాద్ చేతుల మీదగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. మార్చి 21,22,23 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ బ్రోచర్ ఆవిష్కరణలో రాయల కోటయ్య, గుర్రాల కృష్ణారెడ్డి,మాదాల రామారావు, అన్నం కృష్ణమూర్తి, పోతినేని నరసింహారావు, పిచ్చయ్య, రావూరి రామారావు, గండ్ర నర్సయ్య, సామినేని శ్రీనివాసరావు, చిలువేరు శాంతయ్య, సంక్రాంతి వీరయ్య, గడ్డం శ్రీహరి కృష్ణ, కొర్లగంటి మాధవరావు, మాదాల శ్రీనివాసరావు, మాదాల నరసింహారావు, కరణం బ్రహ్మం, నెల్లూరు సురేష్ పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Srinivasa Rao | ఇసుక అక్రమ రవాణా.. డంపింగ్ చేసినా క్రిమినల్ కేసులు: గద్వాల ఎస్పీ శ్రీనివాస రావు