కారేపల్లి : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూములుకు నీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో రైతు సదస్సులో రాంబాబు మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి మూడు వరుస వ్యవసాయ సీజన్లలో వచ్చిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా లో సాగర్ ఆయకట్టు కూడా బీడుగా మారిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా సాగుకు గోదావరి జలాలు తరలింపు మాత్రమే పరిష్కారం అని 2003 లో ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గోదావరి జలాలు సాధన మహా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు అని గుర్తు చేశారు.
రాష్ట్రం లో 2004 లో అధికారం లోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2025 డిసెంబర్ 31 దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన నేటికీ పూర్తి చేయుడంలేదు అన్నారు, 2016 కేసిఆర్ నాయకత్వం లో ప్రభుత్వం రిడిజైన్ పేరుతో మార్పు చేసి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ జూలూరుపాడు మండలం చివరి వరకు పూర్తి చేసింది అని, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయింపులు లేకపోవడంతో పనులు కొనసాగడం లేదని అన్నారు.
గోదావరి జలాలు పాలేరు కు అనుసంధానం చేయడం తోపాటు కామేపల్లి, కారేపల్లి మండలాల పరిధిలో సాగు భూములు కు నీరు అందించాలని, సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలి లేదంటే రైతు ఉద్యమం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో తీవ్ర యూరియా కోరత ఏర్పడింది అని అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఐక్య రైతు ఉద్యమమే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కే నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు సీతారామయ్య, మాజీ సర్పంచ్ రాంబాయిమ్మ, ధనమ్మ, వెంకన్న, శ్రీనివాసరావు, రవి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.