ఖమ్మం : రక్తదానం సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సమాజసేవలో పాలుపంచుకోవాలన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రతి 2సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. అత్యవసర సమయానికి రక్తం అందక ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు పండ్లను అందజేశారు.
ఆటో డ్రైవర్లు, యువకులు, పోలీస్ సిబ్బంది ఉత్సహంగా పాల్గొని యాబై మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ అంజనేయులు, రామోజీ రమేష్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, సీఐ లు అంజలి, చిట్టిబాబు, శ్రీధర్, రామకృష్ణ , తుమ్మ గోపి, శ్రీనివాసులు, ఆర్ ఐ లు రవి, శ్రీనివాస్ ,తిరుపతి, శ్రీశైలం, కార్పొరేటర్ వేంకటేశ్వర్లు, డాక్టర్లు బి. బాలు, జీతేందర్, పాల్గొన్నారు.