మణుగూరుటౌన్, ఏప్రిల్ 10 : భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాలులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు దేశ భవిషత్ను నిర్ణయిస్తాయన్నారు. తరతరాలుగా బడుగు బలహీన, అణచివేతకు గురైన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చిన రాజ్యాంగం ఉండాలా? మార్చాలా? అనే అంశాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారపోస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి సీతక్కను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకుడు బట్టా విజయ్గాంధీ తదితరులు పాల్గొన్నారు.