భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రతీ ఆసుపత్రి క్లీన్గా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. వైద్యాధికారులతో కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12 నాటికి సీహెచ్సీల మరమ్మతుల పనులు. అశ్వారావుపేట ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ కూడా టిఫ్పా, రేడియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. డీఎంఈ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, సూపరింటెండెంట్ కుమారస్వామి, డీసీహెచ్ఎస్ రవిబాబు, డీఎంహెచ్వో దయానందస్వామి పాల్గొన్నారు.
జిల్లాలో ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానం ప్రక్రియ 78.34 శాతం జరిగినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ముఖ్య ఎన్నికల అధికారి నితీశ్ ఢిల్లీ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోఈ నెల 3, 4 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామన్నారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీగార్డెన్ ఉండాలని కలెక్టర్ అనదీప్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. డీడబ్ల్యూవో, సీడీపీవోలు, సూపర్వైజర్లతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూట్రీగార్డెన్ వేసేందుకు నీటి సదుపాయం లేని అంగన్వాడీ కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రెండో దశలో కూడా జిల్లాలో 1,079 కేంద్రాల్లో చిరుధాన్యాల ఆహారం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం 14,667 మందిని గుర్తించినట్లు చెప్పారు.