భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాద్రి దివ్యక్షేత్రంలో గురువారం సీతారాములకు అర్చకులు నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం, నిత్య పూజలు జరిపారు.
అనంతరం స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి శాస్ర్తోక్తంగా నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలను అందజేశారు.