ఉమ్మడి రాష్ట్రంలో ఆ జిల్లా వెనుకబాటుకు గురైంది. కనీస సౌకర్యాలు లేక కునారిల్లింది. వ్యవసాయరంగం కుదేలైంది. విద్యావైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక భద్రాద్రి జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు పెడుతున్నది. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు చేరువ అయ్యారు. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన అందుతున్నది. కార్పొరేట్ను తలదన్నేలా సర్కారు దవాఖానల్లో వైద్యసేవలు అందుతున్నాయి. వ్యవసాయాన్ని పండుగ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు సస్యశ్యామలంగా మారింది.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. అంతేకాదు, సబ్బండవర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాస్పుస్తకాలు, రైతుబీమా, రైతుబంధు, ఆసరా, కేసీఆర్కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సన్నబియ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం, మైనార్టీ గురుకులాల ఏర్పాటు, రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, రూ.2,350 కోట్లతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా ఎన్నో పథకాలు ప్రత్యేక ముద్ర వేసుకున్నాయి.
ఐదేళ్లలో జిల్లావ్యాప్తంగా రూ.1,726.86 కోట్లు సాయం అందజేత
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. ఇప్పటి వరకు రూ.1,726.86 కోట్లు పంపిణీ చేసింది. రైతుబీమా పథకం కింద 18 నుంచి 55 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపజేసింది.
రెండో విడత కంటి వెలుగుకు శ్రీకారం
కార్పొరేట్కు దీటుగా సర్కార్ వైద్యం అందిస్తోంది. కొత్తగూడెం, భధ్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ సమస్య లున్న వారికీ ఉచిత సేవలు అందిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. దీంతో ప్రస వాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకున్న 18,220 మందికి కేసీఆర్ కిట్లు అందజేసింది. కంటి వెలుగు ద్వారా 4,91,344 మందికి కంటి పరీక్షలు చేసి 1,36,878 మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేసింది. సంక్రాంతి తర్వాత ఈ నెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది.
అంగన్వాడీల్లో పెరిగిన సౌకర్యాలు
స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1,434 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 626 మినీ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పౌష్టికాహార పథకం కింద గర్భిణులు, బాలింతలతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న 32,471మందికి బాలామృతం, నెలలో 16 రోజులు గుడ్లు అందజేస్తున్నారు. మూడు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న 24,236 మంది చిన్నారులకు భోజనంతోపాటు వారంలో మూడురోజులు గుడ్లు కూడా అందజేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరోగ్యలక్ష్మీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
భాగంగా నర్సరీల్లో లక్షలాది మొక్కలను పెంచుతూ వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఇటీవల కిన్నెరసాని వైల్డ్లైఫ్లో అటవీ జంతువులతోపాటు అనేక జీవాలను అటవీశాఖాధి కారులు కనుగొన్నారు. జిల్లావ్యాప్తంగా తునికాకు సేకరణకు ఏర్పాట్లతోపాటు లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తగూడెం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు సెంట్రల్ పార్కును నిర్మించారు.
రంగానికి శోభ
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.8 కోట్లతో టూరిజం హోటల్ను నిర్మించారు. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టులో బోటింగ్, అద్దాలమేడ, జింకలపార్కులను అభివృద్ధి చేశారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లిలో సెంట్రల్ పార్కును ఏర్పాటు చేసి దానిలో ఓపెన్జిమ్, వాకింగ్ ట్రాక్, పిల్లలకు సంబంధించిన గేమ్ జోన్ను ఏర్పాటు చేశారు.
ఊరు- మనబడి’తో సర్కారు స్కూళ్లకు మహర్దశ
టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్యను అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రంలోనే కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాతకొత్త గూడెంలో సుమారు రూ.15 కోట్లతో ఉచిత ఇంగ్లిష్ మీడియం స్కూల్ పనులు పూర్తయ్యాయి. నిరుపయో గంగా ఉన్న ప్రదేశాన్ని సరస్వతీ నిలయంగా మార్చారు. ‘మన ఊరు మన బడి’లో జిల్లాకు రూ.61 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో 368 పాఠశాలలు కార్పొ రేట్ స్థాయిని మించి తయారయ్యాయి. ఇప్పటికే 50 పాఠశాలలు వంద శాతం పనులు పూర్తి అయ్యాయి.
అదునుకు రైతుబంధు అందుతుంది
దుక్కులు దున్ని సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో రైతుబంధు సొమ్ము రావడం చాలా సంతోషంగా ఉంది. పంటల మార్పుపై అధికారులు సలహాలు ఇచ్చారు. పంటల మార్పిడి కూడా చేస్తున్నాం. పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. దిగుబడి వచ్చే పంటలను సాగు చేసుకుంటాం. నాకు ఎకరంన్నర ఉంది. ఇప్పటి వరకు రూ.75 వేలు సాయం అందింది.
– కున్సోత్ చందర్, లక్ష్మీదేవిపల్లితండా, సుజాతనగర్ మండలం
అధికారులందరూ ఒక చోటే ఉంటారు
కొత్త కలెక్టరేట్ నిర్మాణంతో అధికారులందరూ ఒకేచోట ఉంటారు. ఏ సమస్య వచ్చినా కలెక్టరేట్కు వెళ్తే పరిష్కారం అవుతుంది. పాలనలో పారదర్శకత ఉంటుంది. సీఎం కేసీఆర్ ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు. సార్కు ప్రజల సమస్యలు తెలుసు. మెడికల్ కాలేజీ చరిత్రలో నిలిచిపోయేది. తెలంగాణ ప్రభుత్వం అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
– వాణిరెడ్డి, కొత్తగూడెం