భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రతి భక్తుడూ స్వామి వారి కల్యాణ వేడుకలను కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాల ని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా ఉండా లని సూచించారు. శ్రీరామనవమి, పుష్కర సామ్రా జ్య పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో కొత్తగూడెంలోని ఐడీవోసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 30న శ్రీరామనవమి, 31న పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు జరుగనున్నట్లు చెప్పారు.
స్వామివారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియంలో సెక్టార్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు కార్యాచరణ తయారుచేయాలని, దానిని పర్య వేక్షించడం అత్యంత ముఖ్యమని అన్నారు. మార్చి 25 నాటికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేం దుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పోస్టల్, మీ సేవా కేంద్రాలు, కార్గో సర్వీసుల ద్వారా భక్తులకు స్వా మివారి తలంబ్రాలు, ప్రసాదాలు చేరవేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు గజ ఈతగాళ్లను, నాటు పడవలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దేవస్థానం ఈవో రమాదేవి, డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీఎంహెచ్వో శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, ఆర్టీవో వేణు, ఆహార తనిఖీ అధికారి వేణుగోపాల్, రోడ్లు, భవనాలు ఈఈ భీమ్లా, డీఆర్వో అశోక్చక్రవర్తి, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, జాతీయ రహదారుల డీఈ శైలజ, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్నకల్యాణి, దేవస్థానం డీఈ రవీందర్, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజా చార్యులు పాల్గొన్నారు.