భద్రాచలం, నవంబర్ 26: నేడు దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అంబేద్కర్ కృషేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శనివారం స్థానిక ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం, అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వీరయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్, బుడగం శ్రీనివాస్, రవికుమార్, బోగాల శ్రీనివాస్ రెడ్డి, కంభంపాటి సురేశ్, సుబ్బారావు, మహిళా నాయకులు వసంతాల రాజేశ్వరి, తుమ్మల రాణి, సరిత, వసీమా, హసీమా, పౌల్రాజ్, రాజా, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
దుమ్ముగూడెం, నవంబర్ 26: దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని, అంబేద్కర్ రాజ్యాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, వై.మల్లికార్జున్, వినయ్కుమార్, నరేశ్ పాల్గొన్నారు.
కరకగూడెం,నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ రేగా కాళిక పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊకే రామనాథం, ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్వోటూ జీఎం డీ లలిత్కుమార్ మాట్లాడుతూ కుల,మతాలకు అతీతంగా సోదరభావంతో మసులుకోవడం మన దేశ ప్రత్యేకత అన్నారు. కార్యక్రమంలో ఏఎస్వో వెంకటరమణ, డీజీఎం పర్సనల్ రమేశ్, డీజీఎం ఐఈ వెంకట్రావు, డీజీఎం పర్సేజ్ శ్రీనివాసమూర్తి, డీజీఎం క్వాలిటీ వెంగళరావు, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, రామేశ్వరరావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబీరుద్దీన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అశ్వాపురం, నవంబర్ 26: రాజ్యాంగం ద్వారా పౌ రులందరికీ సమాన హక్కులు వర్తిస్తున్నాయని ఎంపీపీ ముత్తినేని సుజాత అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ కోఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎస్కే ఖదీర్, ఎంపీడీవో వరప్రసాద్, సూపరింటెండెంట్, యూడీసీ, ఏపీఎం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గౌతమినగర్ కాలనీలో భారజల కర్మాగారం ఉద్యోగ సంఘాల నేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పాడ్య కేశవరావు, డీవై స్వామి, రత్నకుమార్, మోహన్బాబు, లక్ష్మణ్కుమార్, వినయ్సాగర్, వూకే వెంకటేశ్వర్లు, సాదిక్ పాల్గొన్నారు.