ఖమ్మం, మే 13: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బైపాస్ రోడ్లోని తెలంగాణతల్లి సర్కిల్లో రూ. 3.5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ను ప్రారంభిస్తారు. అనంతరం వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శిస్తారు. తర్వాత ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ డీపీఆర్సీ భవనంలో ఉభయ జిల్లాల అధికారులను ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తారు. అనంతరం రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తిలో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు.