ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరెల పంపిణీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, 2వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నర్రా యల్లయ్య, ఉపాధ్యక్షులు చిలుమూరు కోటి, ఎండీ ఫయాజ్, షేక్ రజీం, అంగన్వాడీ టీచర్లు నాగమణి, మాధురి, జయ, శాంతి తదితరులు పాల్గొన్నారు.