చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ జరుగుతున్నదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పేదింటి మహిళలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ది పథకాలలో ముందంజలో ఉన్నదని, దేశం గర్వించదగ్గ సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు. 26గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలలో సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, రేషన్డీలర్లు, అంగన్ వాడీ సిబ్బంది పాల్గొన్నారు.