ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.
ఖమ్మం నగరంతో పాటు కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్లను ఎన్నికల పరిశీలకులు సుదర్శన్రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పరిశీలించారు. అనంతరం బందోబస్తు మద్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సీల్ వేశారు.