భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చర్ల మండలం ఆర్.కొత్తగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బోడె గణేశ్ (26) పొలంలో నాట్లు వేస్తుండగా పక్కనే ఉన్న పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.